కొలంబో: ఇండియాతో సిరీస్కు ముందు శ్రీలంక టీమ్లో వరుసగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇంగ్లండ్ వెళ్లి వచ్చిన టీమ్లో మొదట బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ కరోనా బారిన పడగా.. ఇప్పుడు ఆ టీమ్ డేటా అనలిస్ట్ జీటీ నిరోషన్కు కూడా కరోనా సోకినట్లు తేలింది. ఈ మధ్యే ఇంగ్లండ్లో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడింది శ్రీలంక టీమ్. ఆ సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ టీమ్లో ముగ్గురు ప్లేయర్స్ సహా మొత్తం ఏడుగురికి కరోనా సోకినట్లు తేలింది. అక్కడి నుంచి స్వదేశానికి వచ్చిన శ్రీలంక టీమ్కు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. ఈ ఇద్దరికీ పాజిటివ్ అని తెలిసినట్లు శ్రీలంక క్రికెట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. గురువారం ప్లేయర్స్, కోచింగ్, సపోర్ట్ స్టాఫ్కు టెస్టులు నిర్వహించగా నిరోషన్కు పాజిటివ్గా తేలినట్లు తెలిపింది. ఇండియా, శ్రీలంక మధ్య ఈ నెల 13 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.