నిర్మల్ చైన్గేట్, జూలై 7 : ప్రభుత్వ దవాఖానలు కార్పొరేట్ హాస్పిటల్స్కు దీటుగా సేవలు అందిస్తు న్నాయి. సర్కారు ఇచ్చే నిధులు, మందులను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి. 2020-21 సంవత్సరానికి గాను పారిశుధ్య నిర్వహణకు గుర్తింపుగా వైద్య ఆరోగ్యశాఖ కాయకల్ప అవార్డులను ప్రకటించింది. నిర్మల్ పట్టణంలోని రాంనగర్ అర్బన్ పీహెచ్సీతోపాటు ఏడు పీహెచ్సీలు ఎంపికయ్యాయి. నిర్మల్ జిల్లా ఏరియా దవాఖాన రాష్ట్ర స్థాయిలో ఏడో స్థానంలో నిలువడం అభినందనీయం. కాగా.. అవార్డు కోసం ఎంపిక చేసేందుకు ఏడు అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారు. పచ్చదనం పరిశుభ్రత, పారిశుధ్యం అమలు, జీవపదార్థాలు, దవాఖానల నిర్వహణ, వ్యక్తిగత పరిశుభ్రత, సపోర్టింగ్ సర్వీస్ను ప్రామాణికంగా తీసుకుని అవార్డును ప్రకటించారు. అవార్డుకు ఎంపికైన దవాఖానలకు పారితోషికం అందనుంది. జిల్లా దవాఖానకు కన్సోలేషన్ కింద రూ.3 లక్షలు, రాంనగర్, కుభీర్ పీహెచ్సీలకు రూ.2 లక్షలు, మిగతా ఆరు పీహెచ్సీలకు కన్సోలేషన్ కింద రూ.50 వేలు రానున్నాయి.
సమష్టి కృషితో అవార్డు ఎంపిక
దవాఖాన సిబ్బంది సమష్టి కృషితో అవార్డుకు ఎంపికైంది. రోగులకు మెరుగైన సేవలందించడంతో పాటు దవాఖాన పరిశుభ్రంగా ఉంచడం జరుగుతుంది. కరోనా సమయంలో సిబ్బంది సేవలందించారు. సిబ్బంది సమన్వయంతో పని చేస్తున్నారు. వ్యాక్సినేషన్, గర్భిణులకు, సేవలందించడం ఇవన్నీ పరిశీలించి అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డురావడం హర్షణీయం. ఇదే స్ఫూర్తితో రోగులకు మరింత సేవలందించేందుకు కృషి చేస్తాం.