న్యూఢిల్లీ, జూన్ 30: షియామీ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీల ధరలు పెరుగుతున్నాయి. గురువారం నుంచి దాదాపు 3-6 శాతం మేర వీటి ధరలను పెంచుతున్నట్లు బుధవారం ఈ చైనా సంస్థ ప్రకటించింది. విడిభాగాల కొరత, పెరిగిన దిగుమతి, రవాణా ఖర్చుల నేపథ్యంలోనే ఈ నిర్ణయానికి వచ్చామని తెలియజేసింది.