అమరావతి,జూన్ 30:రేపటి నుంచి కర్ఫ్యూ ఆంక్షలను సడలిస్తున్నట్లు ఏపీ సర్కారు ప్రకటించింది. కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువఉన్నఎనిమిదిజిల్లాల్లోఅనంతపురం,గుంటూరు,కడప, కర్నూలు,నెల్లూరు,శ్రీకాకుళం,విశాఖపట్నం, విజయనగరంల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకుకార్యకలాపాలకుఅనుమతులుఇవ్వగాపశ్చిమగోదావరి,తూర్పుగోదావరి,కృష్ణా,చిత్తూరు,ప్రకాశం జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నఆంక్షలే కొనసాగనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు. ఈ ఆంక్షలు జూలై 7 వరకు అమలులోఉండనున్నాయి.