రోమ్ : కరోనా వైరస్ నుంచి దేశం యావత్తూ లో రిస్క్ జోన్గా మారడంతో ఇటాలియన్లు ఊపిరిపీల్చుకున్నారు. ఇటలీ ప్రజలు సోమవారం నుంచి మాస్క్లు లేకుండా బయటకు రాగలిగిన పరిస్థితి నెలకొంది. ఏడాదిన్నరగా వెంటాడిన మహమ్మారిని అధిగమించిన యూరప్లోనే అరుదైన ఈ మైలురాయిని చేరుకున్న తొలి దేశంగా ఇటలీ నిలిచింది. కొవిడ్-19 రిస్క్ను రంగుల్లో సూచించే ఇటలీలో మొత్తం 20 రీజియన్లను లోరిస్క్ క్యాటగిరీగా భావించే వైట్లోకి చేర్చినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తొలిసారిగా సోమవారం ప్రకటించింది.
దీంతో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించాల్సిన అవసరం లేదు. ఇటలీ అంతటా లో రిస్క్ ప్రాంతంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించినా పలువురు మాస్క్లు ధరించే కనిపించారు. మహమ్మారి ఇంకా సమసిపోలేదని అందుకే జాగ్రత్తగా ఉండటం మంచిదని రోమ్ నగరానికి చెందిన ఓ మహిళ పేర్కొన్నారు. ఇక ఇటలీలో గత కొద్ది వారాలుగా కరోనా కేసులు, మరణాలు గణనీయంగా తగ్గాయి. ఇటలీలో 12 ఏండ్లు పైబడిన జనాభాలో మూడింట ఒక వంతు జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది.