మెదక్ రూరల్, జూన్ 27: టీకాతోనే కరోనా నివారణ సాధ్యమని , వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్య సిబ్బంది పవన్ అన్నారు. ఆదివారం మెదక్ మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో వ్యాక్సినేషన్ కేంద్రం అర్బన్ వైద్యశాల ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజలు టీకాపై అపోహలు పెట్టుకోకుం డా వ్యాక్సిన్ వేసుకోవాడానికి ముందుకు రావాలని సూచించారు, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నుంచి దూరంగా ఉండవచ్చున్నారు. ఈ రోజు సుమారు 100 మంది వ్యాక్సిన్ వేసుకున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో స్టాఫ్ నర్సులు ఏఎన్ఎం సుధా రాణి , మున్సిపల్ సిబ్బంది ఉన్నారు
రామాయంపేటలో…
రామాయంపేట, జూన్ 27: రామాయంపేట పట్టణంలోని సీహెచ్సీ ప్రభుత్వ దవాఖానలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.ఆదివారం 157 మందికి సిబ్బంది కొవిడ్ టీకాను వేశారు. మొదటి డోస్ వేసుకున్న వారు కచ్చితంగా సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేసుకోవాలని సిబ్బంది తెలిపారు. రామాయంపేట, నిజాంపేట మండలాలకు చెందిన ఆయా గ్రామాల ప్రజలు నేరుగా దవాఖానకు చేరుకుని సిబ్బంది ద్వారా వ్యాక్సిన్ టీకాను తీసుకున్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు నిర్మల, యశోద ఉన్నారు.