మన్సూరాబాద్, జూన్ 17: లిఫ్ట్ సౌకర్యంతో పాటు ఆధునిక హంగులతో మూడు ఫ్లోర్లతో కమ్యూనిటీ హాల్ను నిర్మిస్తున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ పరిధి త్యాగరాయనగర్, ఆనంది ఎన్క్లేవ్, ఫతుల్లాగూడ విలేజ్, సాయి సప్తగిరి కాలనీల్లో రూ.2.60కోట్లతో నూతనంగా చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు గురువారం కార్పొరేటర్ చింతల అరుణతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్యాగరాయనగర్ కాలనీలో మూడు ఫ్లోర్లతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్లో గ్రౌండ్ ఫ్లోర్ సీనియర్ సిటిజన్స్, మొదటి ఫ్లోర్ మహిళా సంఘాలు, రెండో ఫ్లోర్లో కాలనీలవాసులు శుభకార్యాలు చేసుకునేలా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.
వర్షా కాలంలో కాలనీల్లో వరదనీరు, డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పలు కాలనీల్లోని ఓపెన్ డ్రైనేజీ వ్యవస్థలను వెడల్పు చేయడంతో పాటు వాటిపై శ్లాబులు వేసి ప్రజలు ప్రమాదాల బారినపడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.కార్యక్రమంలో త్యాగరాయనగర్ అధ్యక్షుడు బాలచందర్, గౌరవాధ్యక్షుడు మల్లన్న, ప్రధాన కార్యదర్శి ఎం.రాజు, సభ్యులు జె.మురళీకృష్ణ, పరమేశ్, గౌరి, రమ్య, మాధవి, నాయకులు చెరుకు ప్రశాంత్గౌడ్, అనంతుల రాజిరెడ్డి, చింతల సురేందర్యాదవ్, చెరుకు జంగయ్యగౌడ్, తూర్పాటి చిరంజీవి, కందికంటి కన్నాగౌడ్, వడ్డెపల్లి దశరత్ సాగర్, శ్యామల, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మన్సూరాబాద్ డివిజన్ పరిధి వినాయక్నగర్ కాలనీలో రూ. 91లక్షలతో ఏర్పాటు చేయనున్న భూగర్భ డైనేజీ పైపులైన్ పనులకు గురువారం కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డితో కలిసి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కాలనీలలో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు, డివిజన్ బీజేపీ అధ్యక్షుడు నాంపల్లి రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.