మంత్రి పువ్వాడ అజయ్కుమార్
ఖమ్మం/ రఘునాథపాలెం, జూన్ 16: పల్లెలు అభివృద్ధిలో పరుగులు తీయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ పల్లెప్రగతికి శ్రీకా రం చుట్టారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండలో మంత్రి ఆకస్మికంగా పర్యటించారు. ఎస్సీ, బీసీ కాలనీల్లో రోడ్డు పక్కన చెత్తను చూసి అధికారులు, ప్రజాప్రతినిధులపై మండిపడ్డారు. నిర్లక్ష్యపు సమాధానం చెప్పిన కార్యదర్శి రాంకీని సస్పెండ్చేయాలని డీపీవోను ఆదేశించారు. అనంతరం ఖమ్మం నగరంలో ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాలకు చెందిన 151 మంది లబ్ధిదారులకు కలిపి రూ.1.51 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.