ఎమ్మెల్సీ కవితకు జడ్పీటీసీ, ఎంపీపీల ఫోరం కృతజ్ఞతలు
హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ల జీతాన్ని 30 శాతం పెంచడంపట్ల జడ్పీటీసీలు, ఎంపీపీల ఫోరం హర్షం వ్యక్తంచేసింది. జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్రెడ్డి బుధవారం ఎమ్మెల్సీ కవితను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు రుణపడి ఉంటామని ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్రెడ్డి తెలిపారు. మరోవైపు నిజామాబాద్ జిల్లా మాక్లూర్లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత చిత్రపటాలకు జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్రావు ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు క్షీరాభిషేకం చేశారు.