రద్దీగా పంతంగి టోల్ ప్లాజా

చౌటుప్పల్ రూరల్, జనవరి17 : సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరిగి భాగ్యనగరం బాటపట్టా రు. దీంతో ఆదివారం 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. మండలంలోని పంతంగి టోల్ప్లాజా వద్ద వాహనాలు స్తంభించాయి. మొత్తం 16 టోల్బూత్లకుగానూ హైదరాబాద్ వైపు 9 తెరిచారు. అందులో 8 ఫాస్టాగ్, ఒకటి నగదు చెల్లింపునకు కేటాయించారు. అన్నింటిలోనూ ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. చౌటుప్పల్ పట్టణకేంద్రంలో సైతం వాహనాలు బారులుతీరాయి. మండల పరిధిలోని జాతీయ రహదారిపై వివిధ గ్రామాలకెళ్లే ప్రజలు రోడ్డు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ దృ ష్ట్యా తంగడపల్లి రోడ్డు క్రాసింగ్ను కూడా మూసేశారు. దీంతో స్థానిక, సంస్థాన్నారాయణపురం వైపు వెళ్లే వాహనదారులు నాగారం క్రాస్ రో డ్డు వద్ద యూటర్న్ తీసుకున్నారు.
తాజావార్తలు
- రైతులారా ఆశ కోల్పోవద్దు.. వంద నెలలైనా మీతో ఉంటాం: ప్రియాంక గాంధీ
- నిర్మాణ అద్భుతం దేవుని గుట్ట ఆలయం
- ఈ టీ తాగితే బరువు తగ్గొచ్చు
- జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి కేటీఆర్
- మార్చి 12 నుంచి ప్రచారం మొదలుపెడుతా: మిథున్ చక్రవర్తి
- కిడ్స్ జోన్లో ఎంజాయ్ చేసిన టీమిండియా క్రికెటర్లు.. వీడియో
- ఆగస్టు 31 నుంచి కార్లలో కో-డ్రైవర్ ఎయిర్బ్యాగ్ మస్ట్.. మళ్లీ ధరలమోత!
- మాచా టీతో డిప్రెషన్ దూరం..!
- ప్రతి ఇంటికి ప్రభుత్వ సాయం : మంత్రి కొప్పుల
- హర్మన్ప్రీత్ కౌర్ అరుదైన ఘనత