డెహ్రాడూన్:: ఉత్తరాఖండ్లోని మూడు జిల్లాల ప్రజలు చార్ ధామ్ యాత్ర చేపట్టవచ్చని ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం నిలిపివేసింది. ఆ మూడు జిల్లాల వాసులకు యాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మంత్రి సుబోధ్ ఉనియాల్ వెల్లడించారు. రేపు నైనిటాల్ హైకోర్టు ముందుకు చార్ ధామ్ యాత్రపై నమోదైన కేసు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో వాయిదావేస్తున్నట్లు, జూన్ 16 తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలోని చమోలి, రుద్రప్రయాగ, ఉత్తరకాశీ జిల్లాలకు చెందిన భక్తులు చార్ ధామ్ యాత్రకు ప్రభుత్వం గతంలో అనుమతినిచ్చింది. హిమాలయాల్లో ఉన్న కేదార్నాథ్, బద్రినాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాలను కలిపి చార్ ధామ్ అని పిలుస్తారు. ఈ క్షేత్రాలు మే నెలలో తెరచుకున్నాయి. అప్పటి నుంచి రోజువారీ పూజలు జరుగుతున్నప్పటికీ భక్తులకు అనుమతినివ్వడం లేదు.