కంటోన్మెంట్, జూన్ 13: సీఎం రిలీఫ్ ఫండ్ పథకం నిరుపేదలకు వరంలాంటిదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని మూడో వార్డుకు చెందిన నరేందర్, సాథిక్ బేగంలు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. వారికి ముఖ్యమంత్రి సహాయ నిధికి మూడో వార్డుకు చెందిన పెరుమాల్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి సభ్యుడు అజయ్యాదవ్ దరఖాస్తు చేశారు. ఈ క్రమంలో ఇరువురికి సీ ఎం రిలీఫ్ ఫండ్ మంజూరైంది. దీంతో ఆదివారం బోయిన్పల్లిలోని మంత్రి నివాసం వద్ద నరేందర్కు రూ. 1.50లక్షలు, సాథిక్ బేగంకు రూ. 1.25లక్షల చెక్కులను అజయ్యాదవ్తో కలిసి మంత్రి మల్లారెడ్డి బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం చేయించుకుని బిల్లులు చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్న పేదలను ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుదన్నారు.