బంజారాహిల్స్, జూన్ 13 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్య రంగంపై ఆధారపడిన వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం అనే క చర్యలు చేపట్టిందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. జా తీయ మత్స్య అభివృద్ధి బోర్డు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో వెంగళరావునగర్ డివిజన్కు చెందిన వెంకటరమణమ్మకు చేపలు విక్రయించేందుకు మంజూరైన రూ.11లక్షల విలువైన సంచార చేపల విక్రయ వాహనాన్ని ఆదివారం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఇతర రాష్ర్టాలనుంచి మాత్రమే చేప లు నగరానికి వచ్చేవని, తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ దూరదృష్టితో గ్రామగ్రామాన చెరువుల్లో చేపలు పెంచుతున్నారన్నారు. ప్రతియేటా చెరువుల్లో చేపపిల్లలను మత్య్సశాఖ ఆధ్వర్యంలో ఉచితంగా వేస్తున్నారని, గ్రామాల్లోని మత్స్యకారులు, ముదిరాజ్ కులస్తులకు ఉపాధి లభిస్తుందన్నారు. చేపల ఉత్పత్తి పెరుగడంతో మార్కెటింగ్ను పెంచేందుకు సంచార వాహనాలు అందిస్తున్నారన్నారు. చేపలు విక్రయించేవారికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్యరావు, టీఆర్ఎస్ నాయకులు విజయ్, రమేశ్, సురేశ్, శ్రీపవన్ పాల్గొన్నారు.