ముంబై ,జూన్ 12: జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ ఇండియా మరో విలాసవంతమైన కార్ ను తయారుచేసింది. దీనిని ‘మెర్సిడెజ్ బెంజ్ ఎస్ క్లాస్ ‘పేరుతో మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఫ్లాగ్షిప్ సెడాన్ను జూన్ 17న దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.ఈ ఏడాది తమ సరికొత్త ఫ్లాగ్షిప్ లగ్జరీ ఎస్యూవీ మేబాక్ జిఎల్ఎస్600ను ప్రవేశపెట్టిన తరువాత, ఈ బ్రాండ్ నుంచి వస్తున్న రెండవ మోడల్ ఇది. భారత మార్కెట్లో కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ధర రూ.1.5 కోట్లు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది.
న్యూ జెనరేషన్ 2021 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ను గత ఏడాది సెప్టెంబర్లో అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశపెట్టారు. ఓల్డ్ మోడల్ మాదిరిగానే, ఈ కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ సెడాన్ను కూడా స్థానికంగానే అసెంబుల్ చేయనున్నారు.