మహబూబ్ నగర్ : ప్రజల ఆరోగ్యానికి తీవ్ర స్థాయిలో నష్టం కలిగించే గుట్కాల వ్యాపారం మానుకోవాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్.పి. ఆర్.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని అనుమానిత గుట్కా దుకాణాలు, గోడౌన్ లపై పద్దెనిమిది పోలీసు బృందాలు ఏక కాలంలో దాడులు జరిపాయి.
ఆయా దుకాణాలను సందర్శించి పట్టుబడిన గుట్కా నిల్వలను ఎస్.పి. పరిశీలించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం గుట్కాపై నిషేధం విధించిందన్నారు. గుట్కాలతో జరిగే నష్టం గురించి తెలియక కూలీలు, అమాయక ప్రజలు క్యాన్సర్ వంటి అత్యంత ప్రమాదకర రోగాలకు గురవుతున్నారని ఎస్పీ తెలిపారు. గుట్కా వ్యాపారులపై తమకు పూర్తి సమాచారం ఉందని.. విక్రయాలు చేయాలని చూస్తే జైలు పాలు చేస్తామని హెచ్చరించారు.
గుట్కాలను సరఫరా చేసే వారిపై, అమ్మేవారిపై కఠినమైన పీడీ యాక్టు నమోదు చేస్తామన్నారు. పట్టుబడిన సరుకు వివరాలను పోలీసులు లెక్కిస్తున్నారని తెలిపారు. డీఎస్పీ జి.శ్రీధర్, ఇన్స్పెక్టర్లు జిల్లాలోని పలువురు అధికారుల నేతృత్వంలో ఏర్పడిన టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలలో పాల్గొన్నాయని ఎస్.పి. తెలిపారు.
ఇవి కూడా చదవండి..
బాలిక వైద్యానికి అండగా ఎమ్మెల్సీ కవిత
ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు కూలీలు మృతి
చౌడాపూర్ నూతన మండలాన్ని ప్రారంభించిన మంత్రి సబిత
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
అనాథ పిల్లలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే కిశోర్ కుమార్
బీజేపీకి షాక్.. టీఎంసీలోకి ముకుల్రాయ్!
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
ఆహారం వికటించి 41 మందికి అస్వస్థత