జంటనగరాల్లో వర్షాకాలంలో తలెత్తనున్న ముంపు సమస్యలను ఎదుర్కొనేందుకు జలమండలి ముందస్తు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. తాగునీటితోపాటు సీవరేజీ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఎండీ దాన కిశోర్ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలో జలమండలి రిజర్వాయర్ ప్రాంతాలు, జలమండలి కార్యాలయాల్లోను, సీవరేజీ ప్రాంతాల్లోనూ సోడియం హైపోక్లోరైట్ రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. డ్రైనేజీ ఓవర్ ఫ్లో, కలుషిత నీటిపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, కరోనా నేపథ్యంలో మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.