హైదరాబాద్: కరోనా నేపథ్యంలో మరో ప్రవేశ పరీక్ష వాయిదాపడింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (నైసర్)లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్)-2021 వాయిదాపడింది. దీంతో దరఖాస్తు గడువుతోపాటు, పరీక్ష తేదీని పొడిగించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల్లో నెస్ట్ పరీక్షను వాయిదావేస్తున్నామని అధికారులు వెల్లడించారు. పరీక్షను ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. దరఖాస్తు గడువును జూలై 15 వరకు పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు గడువు ఈనెల 7న ముగుస్తుండగా, ప్రవేశ పరీక్ష 14న జరగాల్సి ఉన్నది.
ఈ ప్రవేశపరీక్ష ద్వారా యూనివర్సిటీ ఆఫ్ ముంబై, భువనేశ్వర్లోని నైసర్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్లో 60 శాతం మార్కులతో పాసైనవారు నెస్ట్ పరీక్ష రాయడానికి అర్హులు.