మహబూబ్నగర్ జూన్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాలమూరు డీసీసీబీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. గురువారం పాలమూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పటిష్టం కోసం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. రుణాల వసూలుకు డీసీసీబీ డైరెక్టర్లు, సీఈఓలు ప్రధాన పాత్ర వహించాలన్నారు. సమావేశంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఎండీ మురళీధర్, అడిషనల్ రిజిస్ట్రార్ సుమిత్ర, డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా, సీఈవో ప్రకాశ్ పాల్గొన్నారు.