యునైటెడ్ నేషన్స్, జూన్ 2: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా గడిచిన ఏడాదిలోనే 10.8 కోట్ల మంది పేదరికంలోకి జారిపోయారని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. వచ్చే ఏడాది 20 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవచ్చని అంచనా వేసింది. ఉద్యోగకల్పన అంతంతమాత్రంగా ఉన్న కారణంగా కనీసం 2023 వరకు ఇబ్బందులు పడక తప్పదని పేర్కొన్నది. అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్వో) వరల్డ్ ఎంప్లాయీమెంట్ అండ్ సోషల్ అవుట్లుక్లో ఈ వివరాలను వెల్లడించింది.