హైదరాబాద్ : అనుమానాస్పదస్థితిలో ఓ మహిళ మృతదేహం వాటర్ ట్యాంక్లో లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. నగరంలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బుద్ధానగర్లో వాటర్ ట్యాంక్లో బాణాల అంజమ్మ (60) అనే మహిళ మృత దేహం లభ్యమైంది. రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయిన అంజమ్మ ఈరోజు వాటర్ ట్యాంక్లో విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి హత్యనా లేక ఆత్మహత్యనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
రాఘవపూర్ పీహెచ్సీకి జాతీయ అవార్డు
సురేందర్ రెడ్డికి నివాళులు అర్పించిన ఎంపీ సంతోష్ కుమార్
అంతర్జాల వేదికగా..ఎన్టీఆర్కు ఘన నివాళులు
రాజద్రోహానికి పరిమితులను సెట్ చేయాల్సిందే: సుప్రీంకోర్టు
రైతులకు జనుము విత్తనాలు పంపిణీ
నారాయణపేట జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత