నారు, కూలీలు లేకుండానే నాటు

అడ్డగూడూరు : అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకు మరింత మేలు చేసేందుకు సీడ్డ్రిల్ వ్యవసాయ పరికరంతో నారు లేకుండానే వరి సాగు చేసే విధానాన్ని అడ్డగూడూరు మండలంలోని లక్ష్మీదేవికాల్వ గ్రామంలో మంగళవారం పీఏసీఎస్ చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు తన వ్యవసాయ భూమిలో చేశారు. సీడ్డ్రిల్ పరికరంలోనే నేరుగా వరి విత్తనాలను మెట్ట భూమిలో 15 ఎకరాలలో పోశాడు. దీంతో కూలీల సమస్యతో పాటు ఖర్చులు కూడా తగ్గాయని ఆయన తెలిపారు. ఒరాలు కూడ తీసే సమస్య తీరడంతో పాటు నారు పోసి నాటు వేసే బాధ కూడ తప్పడంతో రైతు పొన్నాల వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. కూలీల సాయంతో నాటు వేస్తే తనకు రూ.లక్ష వరకు ఖర్చు వచ్చేదని ఇప్పుడు కేవలం రూ.15 వేలు మాత్రమే వచ్చిందన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం కాసానగోడు గ్రామానికి చెందిన పాషా అనే రైతు మూడు పంటలను ఇదే పద్ధతిలో సాగు చేస్తున్నాడని తెలుసుకొని ఆయన సలహాలు, సూచనలతో తాను సీడ్డ్రిల్ పరికరంతో వరి సాగు చేస్తున్నట్లు రైతు పొన్నాల వెంకటేశ్వర్లు తెలిపారు.
తాజావార్తలు
- ఆ టీ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు తెలుసా..!
- జన్నేపల్లి శివాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
- విద్యార్థులను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి
- ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్లోకి ఎస్బీఐ?.. అందుకే..!
- ‘బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా చూడటమే మా ప్రాధాన్యత’
- న్యాయవాద దంపతుల హత్యకు వాడిన కత్తులు లభ్యం
- తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తాం : అసదుద్దీన్ ఒవైసీ
- ప్రచార పర్వం : టీ కార్మికులతో ప్రియాంక జుమర్ డ్యాన్స్
- సంత్ సేవాలాల్ మహరాజ్ నిజమైన సేవకుడు
- నాంది హిందీ రీమేక్..హీరో ఎవరంటే..?