ముందుకొస్తున్న దాతలు
భోజనం ప్యాకెట్లు పంపిణీ
నిత్యావసర సరుకులు అందజేత
జడ్చర్లటౌన్, మే29: కరోనా బారిన పడి హోంఐసోలేషన్లో చికిత్స పొందుతున్న బాధితులకు మనోధైర్యం కల్పిస్తూ మండల ఆర్యవైశ్య సంఘం, సీఎల్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం, రాత్రివేళల్లో ఇంటింటికెళ్లి కరోనా బాధితులకు నాణ్యమైన పౌష్టికాహారం అందజేస్తున్నారు. ప్రతిరోజూ 44 మందికి రెండుపూటల భోజనం అందించడంతోపాటు వారికి మనోధైర్యం కల్పిస్తున్నారు.
మండల ఆర్యవైశ్య సంఘం, సీఎల్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 రోజులుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మండల ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు మేడిశెట్టి రామకృష్ణ, మంచన గణేశ్, కండే కృష్ణ, ఆనంద్రాజు, దేవరాజ్, ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో..
జడ్చర్ల ఆర్టీసీ బస్టాండ్లో శనివారం మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి ఆధ్వర్యంలో భోజనం, తాగునీటి ప్యాకెట్లను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రవీందర్, సందీప్, మనీవర్మ, అభిదాము, శివ పాల్గొన్నారు.
బాటసారులకు బాసటగా..
లాక్డౌన్ సందర్భంగా జడ్చర్లలోని ప్రధాన రహదారులపై బాటసారులకు మాజీ వార్డుసభ్యుడు ప్రీతమ్ ఆధ్వర్యంలో భోజనం, తాగునీటి ప్యాకెట్లను అందజేశారు. ైజడ్చర్ల ఫ్లెఓవర్బ్రిడ్జి, ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు, పేదలకు భోజనం అందించారు. కార్యక్రమంలో రూబెన్, రవియాదవ్, కృష్ణారెడ్డి, శ్రవణ్, సాయిరెడ్డి, ఇంద్రజిత్, తిరుపతి, సందీప్, స్వామి, ప్రణీత్, క్రిస్టీ తదితరులు పాల్గొన్నారు.
దాతలు ముందుకు రావాలి : డీఎస్పీ శ్రీధర్
దేవరకద్ర రూరల్, మే29: కష్టకాలంలో పేదలకు మేమున్నామంటూ భరోసానిచ్చేందుకు దాతలు ముందుకు రావాలని మహబూబ్నగర్ డీఎస్పీ శ్రీధర్ పిలుపునిచ్చారు. శనివారం చిన్నచింతకుంట పోలీస్స్టేషన్లో 180మంది పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ భూత్పూర్ సీఐ రజితారెడ్డి, చిన్నచింతకుంట ఎస్సై భాగ్యలక్ష్మీరెడ్డి చొరవతో మండలంలోని దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. గ్రామాల్లోని దాతలు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని కోరారు. పోలీసుల చొరవ, దాతల సహకారంతో సహాయ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగడంపై డీఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు.
భోజనం ప్యాకెట్లు పంపిణీ
మూసాపేట, మే29: మండలంలోని పలు గ్రామాల్లో కరోనా బాధితులకు శనివారం కొమిరెడ్డిపల్లి గ్రామశివారులోని పాలమూరు డెయిరీ యజమాని ఏవీ రామకృష్ణ భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బగ్గి కృష్ణయ్య, జానంపేట సర్పంచ్ శ్రీనివాసులు, శివరాములు తదితరులు పాల్గొన్నారు.