సిటీబ్యూరో, మే 21(నమస్తే తెలంగాణ): అపోహలు వీడి రక్తదానం చేయాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు. రక్త నిల్వ కేంద్రాల్లో రక్త నిధిని పెంచాలని కోరారు. శుక్రవారం గచ్చిబౌలి సైబరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో రక్తదానం శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ రక్తదానం చేశారు. కార్ హెడ్ క్వార్టర్స్కు చెందిన సుమారు 104 మంది పోలీసు సిబ్బంది 104 యూనిట్ల రక్తాన్ని అందించారు. ప్రతి నెల 6000 వేల మంది తలసీమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు ప్రతి నెల రక్తం అవసరం ఉంటుందని, అందరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలన్నారు.