ఉప్పల్, మే 15: ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. కొవిడ్ వైద్య సేవల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వైద్యాధికారులను ఆదేశించారు. రామంతాపూర్లోని హోమియోపతి దవాఖానను శనివారం ఎమ్మెల్యే సందర్శించారు. దవాఖానలోని కరోనా ఐసొలేషన్ సేవలు, కరోనా టెస్టుల వివరాలు, అదే విధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శ్రీదేవిని అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్ కోసం వచ్చే వృద్ధులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని, సౌకర్యాలు అందించాలన్నారు. నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో హోమియోపతి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్రెడ్డి, డాక్టర్ వేణుసుకుమర్, నేతలు గడ్డం రవికుమార్, గంగిడి కృష్ణారెడ్డి, గుడి మధుసూదన్రెడ్డి, జేసీబీ రాజు, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.
రామంతాపూర్ ప్రభుత్వ హోమియో వైద్యశాల, ఎస్ఐఈటీ సంస్థల మధ్య నెలకొన్న గేట్ వివాదాన్ని శనివారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పరిష్కరించారు. విద్యాశాఖమంత్రి ఓఎస్డీ శ్రీనివాస్రెడ్డితో చర్చించారు. ఈ మేరకు ఎస్ఐఈటీ డైరెక్టర్తో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా చూడాలని కోరారు. దీంతో గేట్ను తెరవడంతో హోమియో వైద్యాధికారులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
చర్లపల్లి: ఇంటింటికీ ఫీవర్ సర్వేను మరింత వేగవంతం చేస్తున్నామని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని చర్లపల్లి కాలనీల్లో చేపట్టిన సర్వేను ఆమె పరిశీలించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు భానుచందర్, ప్రభుగౌడ్, రాజుగౌడ్, శ్రీకాంత్యాదవ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
మల్లాపూర్: కరోనా నేపథ్యంలో మల్లాపూర్ డివిజన్ బ్యాంక్ కాలనీలో కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందితో కలిసి శనివారం ఇంటింటికీ తిరుగుతూ జ్వర సర్వే చేపట్టారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్ష కార్యదర్శులు సుర్ణం రాజేశ్, రవియాదవ్, జీహెచ్ఎంసీ అధికారులు గోవర్ధన్రెడ్డి, ఎస్ఎఫ్ఏ స్వప్న పాల్గొన్నారు.
కరోనా నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుదని కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్ అన్నారు. శనివారం మీర్పేట్ డివిజన్ పరిధిలోని కైలాసగిరి, నవోదయ నగర్, రాజీవ్నగర్ బస్తీల్లో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ జ్వర సర్వేను పరిశీలించారు. కార్యక్రమంలో జైపాల్, అశోక్, యాదగిరి, లింగం, ఐలయ్య, జీహెచ్ఎంసీ సిబ్బంది యాదగిరి, యాకయ్య, లక్ష్మినర్సయ్య, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.