సంగారెడ్డి : కార్యకర్తలకు అండగా నిలుస్తూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామానికి చెందిన తలారి ఆంజనేయులు పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తూ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
మృతుడికి టీఆర్ఎస్ సభ్యత్వం ఉండటంతో పార్టీ తరఫున రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బాధిత కుటుంబానికి మంగళవారం ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. కార్యకర్తలకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చవండి..
రాష్ట్ర సరిహద్దుల్లో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు
వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పువ్వాడ