Yadadri
- Oct 28, 2020 , 00:22:27
VIDEOS
ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి గల్లంతు

గుండాల : ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి గల్లంతు అయిన ఘటన మండలంలోని సుద్దాలలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గూడ కిష్టమ్మ ఇటీవల మృతిచెందడంతో మంగళవారం పది దినాలు జరిగాయి. ఇందులో భాగంగా అదే గ్రామానికి గూడ సోమయ్య (60) తమ కులస్తులతో కలిసి స్నానాల కోసం గ్రామ చెరువు వద్దకు వెళ్లి స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు సోమయ్య నీటిలో మునిగిపోయాడు. ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే జనగామ రూరల్ సీఐ బాలాజీ వరప్రసాద్, ఎస్సై చందర్, ఆర్ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం అందించి గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతు అయిన వ్యక్తికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
తాజావార్తలు
- ఏపీలో కొత్తగా 118 కరోనా కేసులు
- మొదటి ప్రాధాన్యత ఓటు పల్లా రాజేశ్వర్రెడ్డికే
- సామాన్యుడి చెంతకు న్యాయవ్యవస్థను తేవాలి : వెంకయ్యనాయుడు
- కాయిర్ బోర్డ్ సభ్యుడిగా టిఫ్ జాయింట్ సెక్రటరీ గోపాల్రావు
- వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఏడుగురు నిందితులు అరెస్ట్
- 87 లక్షలు పెట్టి ఇల్లు కొని.. భారీ సొరంగం తవ్వి.. వెండి చోరీ
- ఒక్క ఉద్యోగం ఎక్కువిచ్చినా రాజీనామాకు సిద్ధం
- కొవిడ్-19పై అప్రమత్తత : రాష్ట్రాలకు కేంద్రం లేఖ!
- ఐపీఎల్- 2021కు ఆతిథ్యమిచ్చే నగరాలు ఇవేనా?
- అలిపిరి నడకమార్గంలో భక్తుడు గుండెపోటుతో మృతి
MOST READ
TRENDING