న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్గా తేలిన కొన్ని గంటల వ్యవధిలోనే ఓ యువ డాక్టర్ మృతిచెందాడు. ఢిల్లీలోని గురుతేజ్ బహదూర్ (జీటీబీ) ఆస్పత్రిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. ఈశాన్య ఢిల్లీలోని భగీరథీ విహార్ ఏరియాకు చెందిన డాక్టర్ అనాస్ ముజాహిద్ (26) గత జనవరిలో ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ పూర్తిచేసి.. ఇటీవలె గుర్తింపు పొందిన కొవిడ్-19 దవాఖానగా మారిన జీటీబీ ఆస్పత్రిలో విధుల్లో చేరాబే.
శనివారం సాయంత్రం వరకు హుషారుగా విధులు నిర్వహించాడు. ఆ తర్వాత తనతోపాటే పనిచేస్తున్న మరో డాక్టర్ అమీర్ సోహైల్తో కలిసి అతని ఇంట్లో ఇఫ్తార్ విందుకు వెళ్లాడు. ఆ తర్వాత ఆస్పత్రి యాజమాన్యం తమ కోసం ఏర్పాటు చేసిన హోటల్కు తిరిగి వస్తుండగా అనాస్ తనకు అస్వస్థగా ఉన్నదని చెప్పాడు. దాంతో హోటల్కు వెళ్లకుండా నేరుగా ఆస్పత్రికి వెళ్లి కరోనా టెస్ట్ చేయించుకోగా పాజటివ్గా తేలింది.
విషయం తెలిసిన కాసేపటికే డాక్టర్ అనాస్ ముజాహిద్ కుర్చీలోంచి కుప్పకూలిపోయాడు. అతడిని వెంటనే ఐసీయూలో చేర్చి వైద్య పరీక్షలు నిర్వహించగా మెదడులో రక్తం లీకైనట్లు తేలింది. దాంతో అతడిని న్యూమరాలజీ వార్డుకు తరలించి సర్జరీకి ఏర్పాట్లు చేస్తుండగానే ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
నీరవ్ మోదీ అప్పగింత మరింత ఆలస్యం..!
నేపాల్లో 26 మంది ఎంపీలకు కరోనా..!
మాజీ డీజీపీ ప్రసాదరావు కన్నుమూత
పుదుచ్చేరి ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్