పార్డి(కే)లో గ్రామ దేవతలకు జలాభిషేకం
ఇంటిల్లిపాదితో బోనాలు, నూతన వస్ర్తాల సమర్పణ
అమ్మవారికి పూజలు
కుభీర్, మే 9 : కరోనా మహమ్మారి రోజు రోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో వైరస్ నుంచి తమను కాపాడాలని కోరుతూ ఆదివారం కుభీర్ మండలం పార్డి(కే) మహిళలు మహాలక్ష్మి, ముత్యాలమ్మ, దొడ్డి మైసవ్వ, ఊరడవ్వ, దగ్గులమ్మ, ఊర మైసవ్వ, ఆరె మైసవ్వ తదితర గ్రామ దేవతలకు గోదావరి జలాలతో అభిషేకం చేశారు. నూతన వస్ర్తాలు సమర్పించారు. బోనాలతో పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కరోనా నుంచి కాపాడాలని వేడుకున్నారు. ముందుగా స్థానిక పాత జీపీ వద్ద బోనాలు వండిన మహిళలు హారతులు, నెత్తిన దొంతులతో డప్పు వాయిద్యాలతో మహాలక్ష్మి ఆలయానికి తరలివచ్చారు. అంతకు ముందు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు. సర్పంచ్ ఆకుల గంగాధర్, పీఏసీఎస్ సీఈవో ఎగ్గం క్రాంతి కుమార్, ఉప సర్పంచ్ వివేక్ నాయక్, మాజీ ఎంపీటీసీ బందెల శంకర్, వీడీసీ అధ్యక్షుడు ఆకుల వెంకటేశ్, లంక పోశెట్టి, గోజల హన్మాండ్లు, అంగన్వాడీ ఆయాలు తోకల సావిత్రీయి, కొజ్జ లక్ష్మి, సుంకరి రుక్మాబాయి, ఆకుల లక్ష్మి, నాయకులు మైస శంకర్, దొంతుల రాజసుందరి, వందలాది మంది మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కొత్తగూడెం కాలనీలో..
దస్తురాబాద్, మే 9 : మండల కేంద్రంలోని కొత్తగూడెం కాలనీలో ప్రజలు ప్రత్యేక పూజలుచేశారు. మేక, కోడి, కొబ్బరి కాయలు, ఏడు రకాల ఫలహారాలతో గ్రామం మధ్య ఉన్న చెట్టు దగ్గరకు వెళ్లి కరోనా మహమ్మరికి ప్రత్యేక పూజలు చేశారు.
ఎదులాపురం, మే 9 : పట్టణంలోని శివాజీ చౌక్ మారెమ్మ ఆలయంలో మహిళలు పూజలు చేశారు. శ్రీరాం కాలనీ వార్డు కౌన్సిలర్ శ్రీలత, కాలనీ మహిళలు సుజాత, అనురాధ, కవిత, అను, పద్మ, గంగమ్మ పాల్గొన్నారు.
పోచమ్మకు అభిషేకం
ఉట్నూర్ రూరల్, మే 9 : లక్కారం నేతకాని నగర్ గ్రామస్తులు పోచమ్మకు పూజలు చేశారు. కరోనా నుంచి ప్రజలను కాపాడాలని వేడుకుం టూ అమ్మవారికి అభిషేకం చేశారు. గ్రామస్తులు మహేందర్, ఆశన్న, నర్సయ్య, లస్మయ్య, ప్రసాద్, రాజన్న, పాల్గొన్నారు.
గ్రామదేవతలకు నైవేద్యాల సమర్పణ
బోథ్, మే 9: కరోనా మహమ్మారి తగ్గాలని మండల కేంద్రంలో పోచమ్మ, నల్ల పోచమ్మ, ఊర పోచమ్మ, ముత్యాల పోచమ్మ, మహాలక్ష్మి పోచమ్మ ఆలయాల్లో మహిళలు సల్ల కుండలతో ప్రత్యేక పూజలు చేశారు. నైవేద్యాలు సమర్పిం చారు. కార్యక్రమంలో సర్పంచ్ సురేందర్ యాదవ్, మహిళలు పాల్గొన్నారు.