ముంబై ,మే 7 :స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ఉన్నాయి.సెన్సెక్స్ 49,000 పాయింట్లను క్రాస్ చేసింది. నిఫ్టీ 14,800 పాయింట్లు దాటింది. కీలక రంగాల షేర్లు రాణించడం కలిసి వచ్చింది. కరోనా వ్యాక్సీన్ పైన మేధో హక్కుల నిబంధనలను తాత్కాలికంగా రద్దు చేయాలని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో భారత్ చేసిన ప్రతిపాదనకు అమెరికా సమ్మతించింది. దీంతో టీకాల సరఫరా మెరుగుపడే అవకాశాలున్నాయనే సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును మరింత పెంచింది.సెన్సెక్స్ ఈరోజు 49,169.14 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,417.64 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,169.14 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
0.34 శాతం అంటే సెన్సెక్స్ 168.59 పాయింట్లు ఎగిసి 49,121.65 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 14,816.85 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,863.05 వద్ద గరిష్టాన్ని, 14,771.45 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 0.44శాతం అంటే 64.90 పాయింట్లు ఎగిసి 14,789.70 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.