దుండిగల్, మే 4 : కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె.రమణమూర్తి(40) అనంతపురం బెటాలియన్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఏడేండ్ల కిందట రమణమూర్తి పదోన్నతిపై హైదరాబాద్కు వచ్చి ఇంటలిజెన్స్(సెక్యూరిటీ) విభాగంలో గన్మెన్గా పనిచేస్తూ పాండు బస్తీలో కుటుంబం కలిసి నివాసముంటున్నాడు. కొంతకాలంగా రమణమూర్తి మద్యం తాగుతుండటంతో భార్యాభర్తల మధ్య కలహాలు చోటుచేసుకున్నాయి. అతడి భార్య శారద 15 రోజుల కిందట తన ఇద్దరు కొడుకులతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన రమణమూర్తి ఈ నెల 1న ఇంట్లో ఫ్యాన్కు చీరెతో ఉరివేసుకుని మృతిచెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న దుండిగల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతుడి భార్య శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.