నిత్యపూజలు

యాదాద్రి, నమస్తేతెలంగాణ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం నిత్యపూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయాన్నే సుప్రభాత సేవ అనంతరం బాలాలయంలో ప్రతిష్ఠామూర్తులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. వివిధ పుష్పాలతో స్వామి అమ్మవార్లను అందంగా అలంకరించారు. తులసీదళాలు, పుష్పాలతో అర్చించారు. మంటపంలో శ్రీ సుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణ వేడుకలు వైభవంగా జరిపారు. రాత్రి స్వామి, అమ్మవార్లకు నివేదన జరిపించి, శయనోత్సవం చేపట్టారు.
రూ.2.17 లక్షల ఆదాయం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ. 2,17,285 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి గీతారెడ్డి తెలిపారు. ప్రసాద విక్రయాల ద్వారా రూ.1,83,100, కొబ్బరికాయలు రూ.18,000, వాహనపూజలు రూ. 9,000, ప్రధాన బుకింగ్ రూ.1500, ప్రచారశాఖ రూ.1375, టోల్గేట్ రూ.1510, అన్నదాన విరాళం రూ.1700, మినీబస్సు రూ,1,100 ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.
తాజావార్తలు
- ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్
- కారు ఢీకొని బాలుడు మృతి
- కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా అరుణాచల్ప్రదేశ్
- కొవిడ్ ఎఫెక్ట్.. మాల్స్, లోకల్ ట్రైన్స్పై ఆంక్షలు!
- ఆ గవర్నర్ నన్ను కూడా లైంగికంగా వేధించారు!
- హైదరాబాద్లో నడిరోడ్డుపై నాగుపాము కలకలం..!
- ట్విట్టర్ సీఈఓపై కంగనా ఆసక్తికర ట్వీట్
- కేంద్రం ఐటీఐఆర్ను రద్దు చేయకపోయుంటే..
- 89 పోస్టులతో యూపీఎస్సీ నోటిఫికేషన్
- మర్యాద రామన్న..కృష్ణయ్యగా మారాడు..!