గండీడ్, ఏప్రిల్ 28: ప్రభుత్వం రైతులకు అండగా ఉండి అన్ని విధాలా ఆదుకుంటుందని జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ మాధవి అన్నారు. బుధవారం గండీడ్ మండల పరిధి లోని గాధిర్యాల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంబించారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గండీడ్ మండల పరిధిలోని దాదపు పదికోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా ఎక్కడి ధాన్యాని అక్కడే కొనుగోలు చేస్తుందన్నారు. ఈ ప్రాంత రైతులకు ఇబ్బందులకు గురి కాకుండా గ్రా మాల్లోనే కొను గోలు కేంద్రాని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దూర ప్రాంతంలో ఉన్న మార్కెట్ తరలించి అధిక ఖర్చులు భారిన పడకుండా రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం హర్శించ దగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్రాం రెడ్డి , డ్వాక్ర మహిళలు అంజిలయ్య, వెంకటయ్య, హన్మయ్య తదితరులు ఉన్నారు.
మసీద్ కమిటీలకు చెక్కల పంపిణీ
ప్రభుత్వం అన్ని వర్గాల వారికి అభివృద్ది కృషి చేస్తు న్నదని అని ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి లు అన్నారు. బుధవారం గండీడ్ మండలం కేంద్రంలో రంజాన్ పండగ సందర్భంగా మండల పరిధిలోని ఒక్కో మజీద్కు రూ. పదివేల చొప్పున 8 గ్రామాల మజీద్లకు రూ. 80 వేల చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం లో అన్ని మతాల పండుగలకు ప్రభుత్వం కానుక అందిస్తుందన్నారు. ప్రజా ఆమోదయోగ్యమైప పథకాలను అమ లు చేస్తూ ఇతర రాష్ర్టాల ప్రజలు మన రాష్ట్రం వైపు చూసే లా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఈకార్యక్రమంలో తాసిల్దార్ జ్యోతి, ఎంపీడీవో రూపేందర్రెడ్డి, మజీద్కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.