కరోనా కారణంగా షూటింగ్లు ఆగిపోవడంతో ఇప్పుడు చాలా సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఇప్పుడు ఇదే బాటలో వెంకటేశ్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఎఫ్ 3 రిలీజ్ కూడా ఇప్పుడు ఆలస్యమవుతోంది. నిజానికి ఎఫ్ 3 సినిమాను ఆగస్టు 27న విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు ముందుగా ప్రకటించారు. కానీ కరోనా కారణంగా సినిమా షూటింగ్ నెమ్మదించింది. పైగా దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా పాజిటివ్ రావడంతో షూటింగ్ కూడా నిలిపివేశారు. దీంతో అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు.
దీంతో తన అదృష్టాన్ని నమ్ముకున్న అనిల్ రావిపూడి.. ఎఫ్ 3 సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడం మంచిదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2019 సంక్రాంతికి విడుదలైన ఎఫ్ 2 నవ్వుల పూవులు పూయించింది. ఆ తర్వాత 2020 సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఎఫ్ 3ని కూడా సంక్రాంతికి విడుదల చేస్తే సెంటిమెంట్ వర్కవుట్ అయి సక్సెస్ అవుతుందని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయమై నిర్మాత దిల్ రాజు వద్ద అనిల్ రావిపూడి అర్జీ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై దిల్ రాజు కూడా సుముఖంగానే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సారి కథ మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. పోయినసారి సంక్రాంతి అల్లుళ్లు అంటూ వచ్చి సంచలన విజయం అందుకున్న వెంకటేశ్, వరుణ్ తేజ్ ఈ సారి ఏం చేస్తారో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సోనాల్ చౌహాన్ హాట్ సెల్ఫీ..ఫొటో వైరల్
కరోనా నుంచి కోలుకున్నా: అనిల్ రావిపూడి
జబర్దస్త్ కమెడీయన్ను ఫాలో అవుతున్న బ్రహ్మానందం!
తేలికపాటి లక్షణాలే, కంగారు పడొద్దు: పూజా హెగ్డే
అల్లు అర్జున్కు కరోనా పాజిటివ్..!
ఉప్పెన హీరోయిన్ డూప్.. వైరల్ అవుతున్న ఫొటోస్