న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ తరహా పరిస్థితులు ఉండటంతోపాటు కరోనా ఇన్ఫెక్షన్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. ఈ నేపథ్యంలో తమ రుణాలపై మారటోరియం విధించాలని ఎంఎస్ఎంఈలు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖను కోరుతున్నాయి. ఈ మేరకు ఎంఎస్ఎంఈ సంఘాలు కేంద్ర ఆర్థిక శాఖకు లేఖలు రాయనున్నాయి.
కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో పది రాష్ట్రాల్లో లాక్ డౌన్ తరహా పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో తమ జరిగిన తమ వస్తువులు విక్రయానికి పేమెంట్లు ఇప్పటికిప్పుడు అందుకోలేమని ఎంఎస్ఎంఈలు వాదిస్తున్నాయి.
దీనికి తోడు వినియోగదారుల నుంచి డిమాండ్పై అనిశ్చితి నేపథ్యంలో ఉత్పత్తి కూడా తగ్గించామని చెబుతున్నాయి. చాలా పరిమితంగా ముడి సరుకు కొనుగోలు చేశామని పేర్కొన్నాయి. వర్కింగ్ క్యాపిటల్ కొరత వల్ల తాము పేమెంట్ చేయలేక పోతున్నట్లు తెలిపాయి.
ఈ పరిస్థితుల్లో బ్యాంకుల రుణాలను చెల్లించడానికి తమకు అదనపు సమయం అవసరం అని ఎంఎస్ఎంఈల యాజమాన్యాలు పేర్కొన్నాయి. కనుక ఏ నిబంధనల కిందైనా సరే ఎంఎస్ఎంఈలకు రుణాలపై మరోమారు మారటోరియం ప్రకటించాల్సిన అవసరం ఉందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎఫ్ఐఎస్ఎంఈ) సెక్రటరీ జనరల్ అనిల్ భరద్వాజ్ వ్యాఖ్యానించారు.
ఒకవేళ రుణాల చెల్లింపులపై మారటోరియం విధించకపోతే చాలా ఎంఎస్ఎంఈలు మొండి బకాయిల క్యాటగిరిలోకి వచ్చేస్తాయి. రుణ వాయిదా తేదీ నుంచి 90 రోజుల్లో చెల్లించకపోతే మొండి బాకీ (ఎన్పీఏ)గా పరిగణిస్తాయి బ్యాంకులు.
బ్యాంకులు మొండి బకాయిదారులని ముద్ర వేశాక తమకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణ పరపతి కష్టంగా మారుతుందన్నాయి ఎంఎస్ఎంఈ యాజమాన్యాలు.
ఇందుకు అనుగుణంగానే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఎఫ్ఐఎస్ఎంఈ ప్రతినిధుల నుంచి ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్నసాధక బాధకాలు తెలుసుకున్నారు. ఇప్పటికే గతేడాది మార్చి నుంచి ఆరు నెలల పాటు రుణ వాయిదాల చెల్లింపులపై కేంద్రం, ఆర్బీఐ మారటోరియం ప్రకటించాయి.
ఆర్బీఐ విధించిన మారటోరియం వల్ల 30 శాం ఎంఎస్ఎంఈలు లాభపడ్డాయి. కానీ తాజాగా మరోమారు మారటోరియం విధించడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. దీనివల్ల ఆయా బ్యాంకుల మొండి బాకీలు పెరిగిపోనున్నాయి.
ఆక్సిజన్ సరఫరా అడ్డుకున్న వాళ్లను ఉరితీస్తాం.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి ఇంట్లో సీబీఐ సోదాలు
క్రికెట్ దేవుడు పుట్టాడీరోజే.. చరిత్రలో ఈరోజు
స్టీల్ ప్లాంట్ల నుంచి 1.43 లక్షల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాలు!
ఆక్సిజన్ కు కటకట : అలాగైతే 24 గంటల్లో వ్యవస్థ కుప్పకూలుతుంది..
ఆక్సిజన్ కొరత.. ఆ దవాఖానలో కొత్త రోగులకు నో అడ్మిషన్
మళ్లీ గరీబ్ కల్యాణ్ యోజన: రెండు నెలలు పేదవాడికి 5 కిలోల బియ్యం ఫ్రీ
ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకుల రుణాలు.. ఎందుకంటే?!
ఆక్సిజన్ సిలిండర్ల బ్లాక్ మార్కెంటింగ్ : నిందితుడు అరెస్ట్
మహేష్ ఖాతాలో మరో రికార్డ్.. మైండ్ బ్లాక్ చేసిన సూపర్ స్టార్
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
అత్యంత ఖరీదైన, అతిపెద్ద స్మార్ట్టీవీని ఆవిష్కరించిన షియోమీ
భారత్ భయంకరమైన స్థితిలో ఉన్నది: ఆంథోనీ ఫౌసీ
19 సిటీల్లో హెచ్డీఎప్సీ మొబైల్ ఏటీఎంలు..