కోల్కతా : రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా కేటాయింపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ను ఇతర రాష్ట్రాలకు మళ్లించరాదని డిమాండ్ చేశారు. పలు రాష్ట్రాల్లోని వివిధ ఆసుపత్రుల నుండి ఎస్వోఎస్ ఆక్సిజన్ కాల్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఆమె ఈ డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల మధ్యలో ఉన్న రాష్ట్రంలో ఇటీవల కొవిడ్-19 కేసుల పెరుగుదల తీవ్రంగా ఉంది.
దీంతో బెంగాల్లో ఆక్సిజన్కు డిమాండ్ పెరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. రాబోయే రెండు వారాల్లో పశ్చిమ బెంగాల్లో వైరస్ సంక్రమణ విపరీతంగా పెరగనున్నట్లు తెలిపింది. ఆక్సిజన్ వినియోగస్థాయిలు రోజుకు 450 మెట్రిక్ టన్నులకు పెరగనున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర అవసరాల్ని పరిగణలోకి తీసుకుని ఆక్సిజన్ను వేరే ప్రాంతాలకు మళ్లించ్చొద్దని బెంగాల్ ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది.