Yadadri
- Aug 09, 2020 , 00:04:48
VIDEOS
యాదాద్రిలో శాస్త్రోక్తంగా పూజలు

యాదాద్రి, నమస్తేతెలంగాణ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం స్వామివారికి శాస్ర్తోక్తంగా సంప్రదాయ పూజలు నిర్వహించారు. వేకువజామునే సుప్రభాత సేవతో ప్రారంభించి స్వామివారికి అర్చనలు, అభిషేకం, సువర్ణపుష్పార్చన నిర్వహించారు. మండపంలో ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు, శ్రీ సుదర్శన నారసింహహోమం జరిపారు. ఆగమశాస్త్ర ప్రకారంగా స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మంటపంలోనే ఊరేగించారు. సుమారు గంటన్నర పాటు కల్యాణ తంతు కొనసాగింది. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయుడికి పూజలు జరిగాయి. రాత్రి వేళ స్వామి అమ్మవార్లకు మహా నివేదన అనంతరం శయనోత్సవం జరిపించారు.
తాజావార్తలు
- పదేండ్లలో చేయాల్సిన పనులు11 నెలల్లో పూర్తి చేశాం
- 100 రోజులు కాదు, 100 నెలలైనా వెనక్కు తగ్గొద్దు: ప్రియాంకాగాంధీ
- భారత అమ్మాయిల ఓటమి
- రైతులారా ఆశ కోల్పోవద్దు.. వంద నెలలైనా మీతో ఉంటాం: ప్రియాంక గాంధీ
- నిర్మాణ అద్భుతం దేవుని గుట్ట ఆలయం
- ఈ టీ తాగితే బరువు తగ్గొచ్చు
- జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి కేటీఆర్
- మార్చి 12 నుంచి ప్రచారం మొదలుపెడుతా: మిథున్ చక్రవర్తి
- కిడ్స్ జోన్లో ఎంజాయ్ చేసిన టీమిండియా క్రికెటర్లు.. వీడియో
- ఆగస్టు 31 నుంచి కార్లలో కో-డ్రైవర్ ఎయిర్బ్యాగ్ మస్ట్.. మళ్లీ ధరలమోత!
MOST READ
TRENDING