జిల్లావ్యాప్తంగా రెండో దశల 45వేల ఆర్టీపీసీఆర్ టెస్టులు
3317 మందికి పాజిటివ్గా గుర్తింపు
ఐదుగురు మృతి
వికారాబాద్, మార్చి 21, (నమస్తే తెలంగాణ) : కొవిడ్-19 బారిన పడిన వారికి మెరుగైన చికిత్స అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వికారాబాద్లో ఉన్న మహవీర్ దవాఖానలో 150 పడకలు, తాండూరు జిల్లా దవాఖానలో 47 పడకలు, తాండూరులో పది వెంటిలేటర్లనును సిద్ధం చేశారు. ఐసోలేషన్లో ఉండేందుకు అనంతగిరి టీబీ దవాఖానలో 40, శ్రీ సాయి డెంటల్ దవాఖానలో 50 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 35,236 మందికి వ్యాక్సిన్ తొలి డోస్,7048 మందికి సెకండ్ డోస్ ఇచ్చారు. త్వరలోనే వికారాబాద్లో ఆర్టీపీసీఆర్ పరీక్షల ల్యాబ్ ఏర్పాటు చేయనున్నారు.
జిల్లాలో ఐదు సీటీ స్కాన్ కేంద్రాలు ఉన్నాయి. తాండూరులో 3 కాగా.. ఇందులో ప్రభుత్వ 1, ప్రైవేట్ 2, వికారాబాద్లో 2 ప్రైవేట్ దవాఖానల్లో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా రెండో దశలో 45వేల ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించగా… 3317 మందికి పాజిటివ్గా గుర్తించారు. ఇందులో ఐదుగురు మృతిచెందారు. జిల్లాలోని 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాలుగు సీహెచ్సీ, తాండూరు జిల్లా దవాఖాన 1, ఇక్కడే పీపీయూ కేంద్రాల్లో వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్లు ఇవే..
1.అంగడి రాయచూర్, 2.బంట్వారం, 3.బషీరాబాద్, 4.బొంరాస్పేట్, 5.చన్గోముల్, 6.చిట్యాల, 7.ధారూరు, 8.దోమ, 9.దౌల్తాబాద్, 10.జిన్గుర్తి, 11.కులకచర్ల, 12.మోమిన్పేట్, 13.నాగసముద్రం, 14.నవాల్గా, 15.నవాబ్పేట్, 16.పట్లూర్, 17.పెద్దేముల్, 18.పూడూరు, 19.రామయ్యగూడ, 20.సిద్దులూర్, 21.యాలాల, 22.తాండూరు (పీపీయూ), 23.తాండూరు (జిల్లా దవాఖాన), 24.కొడంగల్ (సీహెచ్సీ), 25.మర్పల్లి(సీహెచ్సీ), 26.వికారాబాద్(సీహెచ్సీ), 27.పరిగి(సీహెచ్సీ).
వ్యాక్సిన్ తీసుకోవాలి
ధారూరు, ఏప్రిల్ 21: ధారూరు మండల పరిధిలో బుధవారం 45 సంవత్సరాలు పైబడినవారికి నాగసముందర్లో 12 మందికి, ధారూరులో 19 మందికి వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ధారూరు, నాగసముందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు రాజు, రమేశ్బాబు మాట్లాడుతూ.. కేంద్రానికి వచ్చేటప్పుడు తమ ఆధార్ కార్డును వెంట తీసుకురావాలన్నారు. ధారూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 54మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ రాజు తెలిపారు.