జగిత్యాల : జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్లో కరోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. గణేష్ నగర్కు చెందిన ఓ వ్యాపారితో ఆయన ఇద్దరు కుమారులకు కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో తండ్రి మొదట మరణించగా, చికిత్స పొందుతూ పెద్ద కుమారుడు మృతి చెందాడు. ఇవాళ చిన్న కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. వారం రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడం.. గణేష్ నగర్లో విషాదాన్ని నింపింది. ఆ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.