న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ కరోనా బారినపడ్డారు.
సోమవారం నిర్వహించిన పరీక్షలో ఆయనకు పాజిటివ్గా నిర్ధారణ కావడంతో చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఐయిమ్స్)లో చేరారు.
88 ఏండ్ల మన్మోహన్ సింగ్ ఇప్పటికే హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నారు. వయోభారం, ఇతర అనారోగ్య సమస్యల దృష్ట్యా వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారు.
దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితిపై ఆదివారమే మన్మోహన్ సింగ్.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. కొవిడ్-19 వ్యాక్సిన్ కోసం ప్రభుత్వం ఇచ్చిన అన్ని ఆర్డర్ల వివరాలను బహిర్గతం చేయాలని కోరారు.
కొవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వానికి పలు సలహాలను సైతం సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి