Yadadri
- Jul 26, 2020 , 00:01:56
VIDEOS
గుట్ట పట్టణ సీఐగా జానకీరెడ్డి బాధ్యతల స్వీకరణ

ఆలేరు: యాదగిరిగుట్ట పట్టణ సీఐగా జానకీరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. శనివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈయన గతంలో హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్స్టేషన్లో సీఐగా పని చేసి బదిలీపై గుట్టకు వచ్చారు. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన జానకీరెడ్డి 1998వ బ్యాచ్లో ఎస్ఐగా ఉద్యోగం పొంది మొదటిసారిగా ఖమ్మం జిల్లాలోని ఏడూళ్లబయ్యారం ఎస్ఐగా పనిచేశారు. అనంతరం ఎల్బీనగర్, మల్కాజిగిరి, కాచిగూడ, నిజామాబాద్ జిల్లా పోలీస్స్టేషన్లలో పని చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రికి బదిలీ కావడం ఆనందంగా ఉందన్నారు.
తాజావార్తలు
- పాత వెహికల్స్ స్థానే కొత్త కార్లపై 5% రాయితీ: నితిన్ గడ్కరీ
- ముత్తూట్ మృతిపై డౌట్స్.. విషప్రయోగమా/కుట్ర కోణమా?!
- శ్రీశైలం.. మయూర వాహనంపై స్వామి అమ్మవార్లు
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం
- స్విస్ ఓపెన్ 2021: మారిన్ చేతిలో సింధు ఓటమి
- తెలుగు ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యుల హవా
- భైంసాలో ఇరువర్గాల ఘర్షణ.. పలువురికి గాయాలు
- గుత్తాకు అస్వస్థత.. మంత్రి, ఎమ్మెల్యేల పరామర్శ
- 2021లో రెండు సినిమాలతో వస్తున్న హీరోలు వీళ్లే
- మహారాష్ట్రలో కొత్తగా 11,141 కరోనా కేసులు.. 38 మరణాలు
MOST READ
TRENDING