Yadadri
- Jul 26, 2020 , 00:05:19
VIDEOS
రైతుల భూములు ఆక్రమించిన రియల్ వ్యాపారిపై చర్యలు తీసుకోవాలి

భువనగిరి : రైతుల పట్టా భూములు ఆక్రమించుకుని ఇబ్బందులకు గురిచేస్తున్న రియల్ వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ డిమాండ్ చేశారు. శనివారం రైతులతో కలిసి ఆర్డీవో భూపాల్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ..మండలంలోని బీఎన్ తిమ్మాపురం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబరు 56లోని 9 ఎకరాల 16 గుంటల భూమిని ఆక్రమించుకుని రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్నారు. రెవెన్యూ ఉద్యోగులను మభ్యపెడుతూ రైతులపై అక్రమ కేసులు బనాయిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు జిట్టా అంజిరెడ్డి, రైతులు పెద్ద ఎల్లయ్య, సత్యనారాయణ, ఉడుత రవి, సత్తయ్య, కృష్ణ, ఎల్లయ్య, నాగులు, హరినాథ్, శ్రీను, జహంగీర్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- తాప్సీ ఇంటిలో ఐటీ సోదాలు
- రాజకీయాలకు శశికళ గుడ్బై
- కొవాగ్జిన్ సామర్థ్యం.. 81%
- ‘రాసలీలల’ మంత్రి రాజీనామా
- ప్రభుత్వంతో విభేదించడం దేశద్రోహం కాదు
- 24/7 వ్యాక్సినేషన్ కేంద్ర మంత్రి హర్షవర్ధన్
- సోషల్ మీడియా నియంత్రణపై రాష్ర్టాలకు అధికారం లేదు
- జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం
- వెన్నునొప్పి ఉంది.. గుర్రం మీదొస్తా !
- జనాభాలో వాళ్ల వాటా 19.. సంక్షేమ పథకాల్లో 35 శాతం
MOST READ
TRENDING