వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) ఎన్నికలకు వెయ్యికి పైగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆదివారం నాడు 29వ వార్డు నుంచి టీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీ గుండు సుధారాణి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు వరంగల్ టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా సుధారాణి ఉండొచ్చంటున్నారు.
బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ(యూ), జనసేన, టీడీపీ, ఏఎస్ఎఫ్బీ, స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో మొత్తం 66 వార్డులు ఉన్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అన్ని వార్డుల్లో పోటీచేస్తున్నాయి. కాగా జనసేన 16 వార్డుల్లో పోటీలో ఉంది. అభ్యర్థులు ఆయా పార్టీల నుండి ఇంకా బీ-ఫారాలను స్వీకరించాల్సి ఉంది.