జగిత్యాల : కరోనా మహమ్మారి ఒకే కుటుంబంలోని ఇద్దరి ప్రాణాలను తీసింది. కరోనా సోకిన తండ్రీకొడుకులు వారంరోజుల వ్యవధిలో మృతిచెందారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కట్కాపూర్లో ఈ విషాద ఘటన జరిగింది.
గ్రామానికి చెందిన గంటా రంజిత్ వారంరోజుల క్రితం కరోనాతో మృతిచెందాడు. అతడి తండ్రి గంటా మల్లారెడ్డి సైతం కరోనా బారినపడి ఆదివారం మృతి చెందాడు.
వారం రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబం తీరని విషాదంలో ముగిపోయింది. మల్లారెడ్డి మృతితో ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి