నూతన ఆవిష్కరణలకు గడువు పెంపు

భువనగిరి : ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఆసక్తి గల ఆవిష్కర్తల నుంచి ఆవిష్కరణలను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ అనితారామచంద్రన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు ఆమె పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ఈ ఆవిష్కరణలు ఉంటాయని, ప్రదర్శనలో పాల్గొనడానికి అన్ని రంగాల, అన్ని వర్గాల ప్రదర్శనలు ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.
గ్రామీణ ఆవిష్కరణలు, విద్యార్థుల ఆవిష్కరణలు, ప్రారంభ ఆవిష్కరణలు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలలో ఆవిష్కరణలు అంగీకరించబడతాయన్నారు.ఇన్నోవేటర్లు తమ ఆవిష్కరణలో పాల్గొనే వారికి, వారి ఇన్నోవేషన్కు సంబంధించిన రెండు, మూడు నిమిషాల వీడియోను, సంబంధిత నాలుగు ఫొటోలను, ఆవిష్కర్త పేరు, వయసు, వృత్తి, ఊరు, జిల్లా పేరుతో వివరాలను 9100678543నెంబరుకు వాట్సాప్ ద్వారా అందించాలన్నారు.
తాజావార్తలు
- నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటావా ? రేప్ కేసులో సుప్రీం ప్రశ్న
- కొవిడ్ -19 వ్యాక్సినేషన్లో మోదీజీ చొరవ : డాక్టర్ హర్షవర్ధన్
- మెసేజ్ పెట్టడానికి, కాల్ చేసేందుకు ఎవరూ లేరు
- ‘బీజేపీ నాయకులు కేంద్రాన్ని నిలదీయాలి’
- 70 ఏళ్లున్న నాకెందుకు టీకా.. ముందు యువతకు ఇవ్వండి!
- చెన్నైలో వ్యాక్సిన్ తీసుకున్న వెంకయ్యనాయుడు
- చాడ్విక్ బోస్మాన్కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు
- బాయ్ఫ్రెండ్తో బ్రేకప్ : ఎవరిని పెండ్లి చేసుకుందో తెలిస్తే షాక్!
- గోల్డెన్ గ్లోబ్ అవార్డులు.. బెస్ట్ పిక్చర్ నోమాడ్ల్యాండ్
- రానా 'అరణ్య' ట్రైలర్ విడుదలకు టైం ఫిక్స్..!