Yadadri
- Jul 23, 2020 , 22:40:10
VIDEOS
రైతు వేదిక నిర్మాణాలను వేగవంతం చేయాలి

- అదనపు కలెక్టర్ కీమ్యానాయక్
భువనగిరి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు సమగ్ర చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయం నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో గూగుల్మీట్ ద్వారా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలోని 92 క్లస్టర్లలో రైతు వేదిక నిర్మాణాలను వేగంగా చేపట్టాలన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. రైతులు వ్యవసాయ అధికారుల వద్ద తమ తమ పంట వివరాలకు సంబంధించిన సమగ్ర వివరాలను అందించాలన్నారు. ఈ గూగుల్మీట్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్, పంచాయతీరాజ్, డీఆర్డీఏ, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- శ్రీవారి ఆలయ బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
- గల్ఫ్ నుంచి తిరిగొచ్చిన ఇద్దరికి యూకే స్ట్రెయిన్
- తాత అదుర్స్.. వందేళ్ల వయసులోనూ పని మీదే ధ్యాస
- బెంగాల్ పోరు : కస్టమర్లను ఊరిస్తున్న ఎన్నికల స్వీట్లు
- రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం..కడవరకు పోరాడుతాం
- ఏపీలో కొత్తగా 124 కరోనా కేసులు
- సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్లో సవరణలు
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఇక్కడ బంగారం లోన్లపై వడ్డీ చౌక.. ఎంతంటే?!
- విమానంలో కరోనా రోగి.. బయల్దేరే ముందు సిబ్బందికి షాక్!
MOST READ
TRENDING