యాదాద్రిలో వైభవంగా నిత్యపూజలు

ఆలేరు : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం స్వామివారికి నిత్యపూజలు వైభవంగా జరిగాయి. మొదటగా సుదర్శన నారసింహ హోమం నిర్వహించి బాలాలయంలో ప్రతిష్ఠామూర్తులను పంచామృతాలతో అభిషేకించారు.
అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్యకల్యాణం అత్యంత వైభవంగా జరిపారు. వివిధ పుష్పాలతో శ్రీస్వామి, అమ్మవార్లను అలంకరించారు. తులసీ దళాలు, బంగారు పుష్పాలతో అర్పించారు. మండపంలోని ఉత్సవమూర్తులకు అష్టోత్తర సేవలు నిర్వహించారు. మహా మండపంలో కల్యాణ సేవ జరుపగా భక్తులు సామాజిక దూరంతో శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
ఖజానాకు రూ. 1,52,664 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ. 1,52,664 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రచారశాఖ ద్వారా రూ. 4,000, ప్రసాద విక్రయాలతో రూ. 1,06,260, వాహనపూజల ద్వారా రూ. 5,200, కొబ్బరికాయలతో రూ. 7,500, శాశ్వతపూజలతో రూ. 28,464లతో కలిపి శ్రీవారి ఖజానాకు రూ. 1,52,664 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.
తాజావార్తలు
- ఆ టైంలో అందరూ భయపెట్టారు: అమలా పాల్
- ఖాదర్బాషా దర్గాను సందర్శించిన హోంమంత్రి
- హిందీ జర్నలిస్ట్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ
- యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పరిశీలన
- ఆస్తి పన్ను పెంపు దారుణం : చంద్రబాబు
- స్మృతి మందాన@6
- ‘నాంది’ 11 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
- వామన్రావు దంపతుల హత్య బాధ కలిగించింది : కేటీఆర్
- 18 ఏళ్లకే ముద్దు పెట్టేశా.. ఓపెన్ అయిన స్టార్ హీరోయిన్
- కందకుర్తి సరిహద్దులో ఇంజక్షన్ కలకలం