బోథ్, ఏప్రిల్ 17 : మండలంలోని కన్గుట్టలో ఉపాధి హామీ పథకం పనులు ఊపందుకున్నాయి. వందలాది మంది కూలీలు శనివారం పనులకు వెళ్లారు. ఊటకుంటలో (పర్క్యులేషన్ ట్యాంక్) పూడికతీత పనులు చేపట్టారు. వ్యవసాయ పనులు పూర్తి కావడంతో జాబ్కార్డులున్న కూలీలంతా పలుగు, పార చేతపట్టి పనులకు వెళ్తున్నారు. తెల్లవారు జామునే పనులకు వెళ్లి మధ్యాహ్నం వరకు ఇండ్లకు తిరిగి వస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు కట్టుకుని పనులు చేస్తున్నారు.
పనులను సద్వినియోగం చేసుకోవాలి
నార్నూర్, ఏప్రిల్ 17 : ఉపాధిహామీ పనులను సద్వినియో గం చేసుకోవాలని ఎంపీడీవో రమేశ్ పేర్కొన్నారు. మండలంలోని తాడిహత్నూర్, నాగల్కొండ, బలాన్పూర్ గ్రామాల్లో చేపడుతున్న ఉపాధిహామీ పనులు, నర్సరీలు, పల్లెప్రకృతివనం, సెగ్రిగేషన్షెడ్లను శనివారం పరిశీలించారు. ఈయన వెంట ఈజీఎస్ ఏపీవో జాదవ్ శేషారావ్, బలాన్పూర్ సర్పం చ్ ఆత్రం పరమేశ్వర్, ఉప సర్పంచ్ విష్ణు, కూలీలు ఉన్నారు.
కొలతలు తీసుకున్న టీఏలు
సిరికొండ, ఏప్రిల్ 17 : ఉపాధి హామీని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఉపాధి హామీ టెక్నిక ల్ అసిస్టెంట్ మోహన్ సింగ్ పేర్కొన్నారు. మండల కేంద్రం తో పాటు వాయిపేట్, పకీర్నాయక్ తండా, రాంపూర్, కొండాపూర్, రాజంపేట్, రాయిగూడ తదితర గ్రామా ల్లో శనివారం ఉపాధి హామీ కూలీలు చేసిన పనుల కొలతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా టీఏ మోహన్ సింగ్ మాట్లాడుతూ.. కచ్చితమైన కొలతలతో పనులు చేయాలని సూచించారు. కూలీలు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి పనులు చేయాలని తెలిపారు. ఇందులో టీఏలు రమేశ్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
కూలీలకు మాస్క్లు పంపిణీ
తాంసి, ఏప్రిల్ 17 : పనిచేసే ప్రదేశంలో ఉపాధిహామీ కూలీ లు తప్పకుండా మాస్క్లు ధరించాలని జామిడి ఎంపీటీసీ అశోక్ అన్నారు. ఉపాధిహామీ కూలీలకు శనివారం మాస్క్లు, శానిటైజర్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ రోజురోజుకూ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని కోరారు. కూలీలు గుంపులుగుంపులుగా ఉండవద్దని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలని తెలిపారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి అనిత, వార్డు సభ్యులు, కూలీలు ఉన్నారు.