వైభవంగా శ్రీ సుదర్శన నారసింహ హోమం

ఆలేరు: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని బాలాలయ మంటపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం నిత్య కల్యాణాన్ని శాస్ర్తోక్తంగా జరిపారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మంటపంలోనే ఊరేగించారు. సుమారు గంటన్నరపాటు కల్యాణ తంతును జరిపారు. స్వామివారి నిత్యపూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. వేకువ జామునే సుప్రభాత సేవ చేపట్టి, ప్రతిష్ఠామూర్తులను ఆరాధిస్తూ హారతి నివేదించారు. ఉత్సవమూర్తులను అభిషేకించి, తులసీ పత్రాలతో అర్చించి, దర్శన మూర్తులకు సువర్ణ పుష్పార్చన చేశారు. మంటపంలో స్వామివారికి అష్టోత్తర పూజ, విశ్వక్సేనారాధన జరిపారు. సాయంత్రం ఆలయ మంటపంలో సేవోత్సవం, రాత్రి అమ్మవార్లకు శయనోత్సవాన్ని నిర్వహించారు.
శ్రీవారి ఖజానాకు రూ. 1,34,286 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ. 1,34,286 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రచారశాఖ ద్వారా రూ. 1,000, ప్రసాద విక్రయాలతో రూ. 1,05,040, వా హన పూజల ద్వారా రూ. 4,600, కొబ్బరికాయలతో రూ. 13,230, ఇతర విభాగాలతో రూ. 300తో కలిపి శ్రీవారి ఖజానాకు రూ. 1,34,286 సమకూరినట్లు తెలిపారు.
తాజావార్తలు
- ప్రైవేటు రంగంలో స్థానిక రిజర్వేషన్ల బిల్లుకు గవర్నర్ ఆమోదం
- కొవిడ్-19 సర్టిఫికెట్పై ప్రధాని ఫోటో ప్రచార ఎత్తుగడే : తృణమూల్ కాంగ్రెస్
- ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
- చివరి టెస్టుకు నెట్స్లో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్
- టాప్-10 బిలియనీర్లలో మళ్లీ ముకేశ్
- వీడియో : ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన ఎమ్మెల్యే
- అంగన్ వాడీల సమస్యలన్నీ పరిష్కరిస్తాం
- బెంగాల్లో అరాచక వాతావరణం కనిపిస్తోంది : యూపీ సీఎం
- అడవి జంతువుల కట్టడికి కమిటీ ఏర్పాటు
- పవన్తో సాయిపల్లవి సినిమా చేయడం లేదా..?