బెంగళూరు: ఉగాది పండుగకు సంబురంగా పుట్టింటికి వెళ్లిన కూతురు కన్నతండ్రి చేతిలో దారుణహత్యకు గురైంది. తల్లిదండ్రుల గొడవలో తల్లిపై దాడి చేస్తున్న తండ్రిని అడ్డుకోబోయి గర్భిణి అయిన వారి కుమార్తె ప్రాణాలు కోల్పోయింది. కర్ణాటకలోని తళి పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళ్తే.. డెంకణీ కోట తాలూకా అంచెట్టి సమీపంలోని కరడికల్ గ్రామానికి చెందిన అరుణాచలం కూతురు వెంకటలక్ష్మి (20)కి కోలారు జిల్లా మాలూరు ప్రాంతానికి చెందిన శ్రీనివాసన్తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది.
ప్రస్తుతం వెంకటలక్ష్మి మూడు నెలల గర్భిణి. పుట్టింట్లో ఉగాది జరుపుకొనేందుకు రెండు రోజుల క్రితం కరడికల్ గ్రామానికి వచ్చింది. అయితే వెంకటలక్ష్మి తండ్రి అరుణాచలం పండుగ తెల్లారి అతిగా మద్యం తాగి భార్యతో గొడవ పడ్డాడు. గొడవ ముదరడంతో ఇంట్లో దాచిన నాటు తుపాకీతో భార్యను కాల్చేందుకు యత్నించాడు. దాంతో అడ్డుకోబోయిన వెంకటలక్ష్మిపై తుపాకీ గుండుపేలింది. వెంకటలక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టానికి తరలించి పరారీలో ఉన్న అరుణాచలం కోసం గాలింపు చేపట్టారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు
సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా మృతి
30 కోట్లతో స్వర్గ సీమను నిర్మించుకున్న కంగనా రనౌత్
కేంద్ర పోలీసు బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు