Yadadri
- Jul 09, 2020 , 23:28:08
VIDEOS
నిస్సార్కు కన్నీటి వీడ్కోలు

గుండాల : ఆట, పాటలతో ప్రజలను చైతన్యపర్చిన రచయిత, కవి, గాయకుడు సుద్దాల నిస్సార్కు గురువారం కన్నీటి వీడ్కోలు పలికారు. కరోనా వైరస్తో మృతి చెందిన నిస్సార్ అంత్యక్రియలు హైదరాబాద్లోనే జరిగాయి. గురువారం సాయంత్రం జగద్గిరిగుట్ట శ్రీనివాస్నగర్లో కుటుంబసభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. గాంధీ దవాఖాన నుంచి కుటుంబసభ్యు లు నేరుగా శ్మశానవాటికకు తీసుకెళ్లి వారి సంప్రదాయాల ప్రకారం ‘గాంధీ’ సిబ్బంది సహకారంతో అంత్యక్రియలను నిర్వహించారు. ఆయన కుటుం బసభ్యులు, అభిమానులు దూరంగా ఉండి వీడ్కోలు పలికారు. గుండాల మండలం, సుద్దాల గ్రామంలో నిస్సార్ లేని లోటు తీరనిది అని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. నిస్సార్ మరణంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
తాజావార్తలు
- అంబారీపేటలో పౌరహక్కుల దినోత్సవం
- వేలం విధానంలో క్రికెట్ టోర్నమెంట్లు వద్దు..!
- ఉగాది నుంచి శ్రీవారి ఆర్జిత సేవలు: టీటీడీ
- కాంగ్రెస్ బలహీనపడిందన్నది వాస్తవం: కపిల్ సిబల్
- సురభి వాణీ దేవిని గెలిపించుకోవాలి : మంత్రి హరీశ్
- బెంగాల్ పోల్ షెడ్యూల్ : ఈసీ నిర్ణయంపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరం
- రోడ్సేఫ్టీ వరల్డ్ సిరీస్లో స్టార్ క్రికెటర్లు
- లొల్లి పెట్టొద్దన్నందుకు తల్లీకొడుకుకు కత్తిపోట్లు
- ఇలా చేస్తే రైతులు దిగి వస్తారన్న బాబా రాందేవ్
- అంబాసిడర్ కంపెనీ ఫర్ సేల్!
MOST READ
TRENDING