అపర మేధావి పీవీ నర్సింహారావు

- ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్
భువనగిరి : ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన అపర మేధావి, మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు అని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. పీవీ శతజయంతి సందర్భంగా ఆదివారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు,
బహుభాషా కోవిదుడు, రచయిత, జర్నలిస్టుగా పీవీ చేసిన సేవలు అనిర్వచనీయమన్నారు. ఆయన తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందాయన్నారు. విద్యారంగంలో ఆయన ఎనలేని కృషి చేశారని, సర్వేల్లో మొదటి గురుకులాన్ని ప్రారంభించి గురుకులాల స్థాపనకు నాంది పలికారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కీమ్యానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- నా రేంజ్ మీకు తెలుసా అంటూ షణ్ముఖ్ వీరంగం..!
- రాజశేఖర్ కూతురు తమిళ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
- బ్లాక్ డ్రెస్లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్
- డేటా చోరీ గిఫ్ట్ల పేర బురిడీ..!
- షూటింగ్లో ప్రమాదం.. హీరోకు గాయాలు
- ఓటీపీ చెప్పండి.. కార్డు గడువు పొడిగిస్తాం..!
- రెండు రోజుల్లో.. రూ. 5లక్షలకు 4.5 కోట్లు లాభం
- రుణాల పేరుతో.. బురిడీ..
- పెండ్లి పేరుతో వల.. రూ. 10.69లక్షలు టోకరా
- బండి ఆపు.. పైసలివ్వు..!