కిడ్నీ రోగులకు ప్రభుత్వం భరోసా

- ఆలేరులోని ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలో డయాలసిస్ సెంటర్ ప్రారంభం
- జిల్లాలోని 200 మందికి పైగా కిడ్నీ బాధితులకు వైద్యం
- విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
- పీహెచ్సీలో రోగులకు పూర్తి స్థాయి వైద్య సేవలు
- సర్వరోగాలకు గాలి, కలుషిత నీరే కారణం
కిడ్నీ రోగులకు ప్రభుత్వం భరోసాగా ఉంటుందని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. “దురదృష్టవశాత్తు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న రోగులు వారానికి ఒకసారి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పొరపాటున వారం రోజులు దాటితే రోగుల ప్రాణాలు ప్రమాదం”గా మారే అవకాశం ఉంటుందన్నారు. ఆదివారం ఆలేరులోని ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, భగవాన్ మహావీర్ జైన్ ట్రస్టు, పలువురు దాతల సహకారంతో నిర్మించిన నూతన డయాలసిస్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని 200 మందికి పైగా కిడ్నీ బాధితులకు సేవలు అందుతాయన్నారు. వేలకు వేలు ఖర్చు చేసి సమయం వృథా చేసుకుని డయాలసిస్ కోసం హైదరాబాద్కు వెళ్లే పరిస్థితులు చూస్తున్నామన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తాగునీటిపై ప్రత్యేక దృష్టిసారించారన్నారు. ఇందులో భాగంగా మిషన్భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన జలాలు సరఫరా చేయిస్తున్నారని గుర్తుచేశారు. సర్వరోగాలకు గాలి, కలుషిత నీరే కారణమన్నారు. -ఆలేరు
కిడ్నీ రోగులకు ఉపశమనం
ప్రభుత్వ విప్ పట్టుదలతోనే సెంటర్ ఏర్పాటు
ఆలేరులో ఏర్పాటు కావడం అదృష్టం
మంత్రికి వినతిపత్రాలు అందజేత
తాజావార్తలు
- సరస్సు నీటి అడుగున పడి.. ఆరు నెలలైనా పనిచేస్తున్న ఐఫోన్
- ధూమపానంతో డిప్రెషన్.. సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి
- 32ఏళ్లుగా రాళ్లు మాత్రమే తింటున్నాడు..ప్రతిరోజూ పావు కేజీ!
- న్యూ లాంఛ్ : 17న భారత మార్కెట్లో షియోమి రెడ్మి టీవీ!
- విదేశాలకు వెళ్తున్నారా? ఇవి తెలుసుకోండి
- మహిళలకు సముచిత ప్రాధాన్యం : ఎమ్మెల్సీ కవిత
- కాంగ్రెస్లో ఉంటే జ్యోతిరాధిత్య సింథియా సీఎం అయ్యేవారు..
- డబ్ల్యూటీసీ ఫైనల్ లార్డ్స్లో కాదు.. సౌథాంప్టన్లో..
- గురుద్వారాలో ఉచిత డయాలసిస్ కేంద్రం.. ఎక్కడంటే!
- సరిహద్దులో భారత సైన్యం ఆటా-పాటా