హరితోద్యమం

పచ్చదనమే లక్ష్యంగా జరుగుతున్న ఆరోవిడుత హరితహారం జిల్లాలో మూడోరోజు శనివారం ఉత్సాహంగా కొనసాగింది. ఎమ్మెల్యే చిరుమర్తి, కలెక్టర్ అనితారామచంద్రన్లతోపాటు ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. మూడురోజుల్లో కలిపి జిల్లావ్యాప్తంగా 2.89 లక్షల మొక్కలు నాటినట్లు జిల్లా అటవీ శాఖాధికారి వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు.
భువనగిరి అర్బన్ : ప్రతి ఇంటి ఆవరణలో ఆరు మొక్కలు నాటాలని మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు తెలిపారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా శనివారం పట్టణంలోని 9, 10, 26 వార్డుల్లో ప్రజలతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో ఆరు మొక్కలు నాటి పరిసరాలను ఆకుపచ్చగా మార్చుకోవాలన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత కూడా చేపట్టాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ బి.వంశీకృష్ణ, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, వార్డు సభ్యులు సుమ, ప్రమోద్కుమార్, నర్సింహ, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- విద్యార్థులను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి
- ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్లోకి ఎస్బీఐ?.. అందుకే..!
- ‘బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా చూడటమే మా ప్రాధాన్యత’
- న్యాయవాద దంపతుల హత్యకు వాడిన కత్తులు లభ్యం
- తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తాం : అసదుద్దీన్ ఒవైసీ
- ప్రచార పర్వం : టీ కార్మికులతో ప్రియాంక జుమర్ డ్యాన్స్
- సంత్ సేవాలాల్ మహరాజ్ నిజమైన సేవకుడు
- నాంది హిందీ రీమేక్..హీరో ఎవరంటే..?
- పాఠశాలలో మరిన్ని వసతులు కల్పిస్తాం : మంత్రి కొప్పుల
- మళ్లీ పెరిగిన పసిడి ధర